నిజామాబాద్​జిల్లాలో164 మంది పోలీసుల బదిలీ 

నిజామాబాద్​జిల్లాలో164 మంది పోలీసుల బదిలీ 

నిజామాబాద్, వెలుగు : జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం భారీగా పోలీసుల బదిలీ జరిగింది. 2018 నుంచి ఒకే చోట పని చేస్తున్న 116  మంది కానిస్టేబుల్స్​, ఒకే ఠాణాలో నాలుగేండ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న 26 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మూడేండ్ల నుంచి ఒకే స్టేషన్​లో కొనసాగుతున్న 22 మంది ఏఎస్సైలు కలిపి మొత్తం 164 మందిని సీపీ ట్రాన్స్​ఫర్​ చేశారు. 

కౌన్సిలింగ్​ ద్వారా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆయన తక్షణమే కొత్త ఠాణాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పోలీస్​ స్టాఫ్ సమస్యలు తెలుసుకోడానికి సీపీ ప్రత్యేకంగా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బదిలీలు చేపట్టారు.