న్యూఢిల్లీ: ఐరన్ ఓర్ రేటును గురువారం నుంచి పెంచుతున్నట్లు ఎన్ఎండీసీ ప్రకటించింది. లంప్ ఓర్ రేటును టన్నుకు రూ. 200 చొప్పున, ఫైన్స్ ఓర్ రేటును టన్నుకు రూ. 100 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో లంప్ ఓర్ టన్ను రేటు రూ. 4,100కి, ఫైన్స్ ఓర్ టన్ను రేటు రూ. 2,910 కి చేరాయి. కిందటి నెల (జులై) లో లంప్ ఓర్, ఫైన్స్ ఓర్ రేట్లను టన్నుకు రూ. 500 చొప్పున ఎన్ఎండీసీ తగ్గించింది. స్టీలు తయారీకి ఐరన్ ఓర్ చాలా కీలకం. ఐరన్ ఓర్ రేట్ల మార్పు ఎఫెక్ట్ స్టీల్ తయారీపై నేరుగా పడుతుంది. మాన్సూన్స్ కారణంగా ప్రొడక్షన్ తగ్గడం వల్లే ఎన్ఎండీసీ రేట్లను పెంచినట్లు రిసెర్చ్ ఫర్మ్స్టీల్ మింట్ వెల్లడించింది. మన దేశంలోనే అతి పెద్ద ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్గా ఎన్ఎండీసీ పేరుపొందిన విషయం తెలిసిందే. దేశీయ ఐరన్ ఓర్ అవుట్పుట్లో 17 శాతం ఈ కంపెనీ నుంచే వస్తోంది.
