ఎమర్జెన్సీలో రక్తం దొరుకుతలే

ఎమర్జెన్సీలో రక్తం దొరుకుతలే
  •     జిల్లా ఆస్పత్రి బ్లడ్​ బ్యాంక్​లో  ఓ పాజిటివ్​, బి–పాజిటివ్​ బ్లడ్​ కొరత​
  •     వృథాగా  బ్లడ్​ కలెక్షన్​ వ్యాన్​
  •     ఎన్​హెచ్​ఎం పై దృష్టి పెట్టని అధికారులు
  •      బ్లడ్​ క్యాంపులు నిర్వహించని స్టాఫ్​

మూడు నెలల క్రితం ఓ యువకుడు అనారోగ్యంతో పట్టణంలోని ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఓ పాజిటివ్​ బ్లడ్​ కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో బంధువులు స్థానిక బ్లడ్​ బ్యాంక్​కు వెళ్లారు. కానీ అక్కడ ఓ పాజిటివ్​ బ్లడ్​ అందుబాటులో లేదు. దీంతో వారు ఇతర ఎన్జీఓలు, ఫ్రెండ్స్​  సాయంతో బ్లడ్​ డోనర్​ను వెతుక్కున్నారు.

 గద్వాల, వెలుగు : జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్​ బ్యాంక్​లో ఎమర్జెన్సీ టైంలో బ్లడ్​ దొరకడం లేదు.   ఓ పాజిటివ్​, బి పాజిటివ్​ రక్తం  అసలే దొరక్కపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీలో బ్లడ్​ కొరత లేకుండా చూడాల్సిన  నేషనల్​ హెల్త్​ మిషన్​ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదు. వీళ్లు జిల్లా వ్యాప్తంగా  బ్లడ్​ డొనేషన్​ క్యాంపులు, రక్తదానం పై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. నేషనల్​ హెల్త్​ మిషన్​ ప్రాజెక్ట్​ను 2018 లో జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభించారు. దీని కోసం మొబైల్​ బ్లడ్​ కలెక్షన్​ వ్యాన్​ను, 5గురు సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. నిత్యం జిల్లా వ్యాప్తంగా తిరిగి గ్రామాల్లో, స్కూళ్లలో, కాలేజీల్లో బ్లడ్​ డొనేషన్​ క్యాంపు నిర్వహించాలి. బ్లడ్​ బ్యాంక్​లో కొరత లేకుండా చూడాలి. కానీ, కేవలం ఆస్పత్రికే పరిమితమైన సిబ్బంది క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో అన్ని గ్రూపుల బ్లడ్​ కలెక్షన్​ జరగడం లేదు. 

లక్షల్లో ఖర్చు.. 

ఎన్​హెచ్​ఎం  సిబ్బంది జిల్లాలో పర్యటిస్తూ ప్రతిరోజు సుమారు 30 యూనిట్ల బ్లడ్ ను సేకరించాలి. ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో భద్రపరచాలి. దీనికోసం  ప్రభుత్వం ప్రతినెలా రూ. లక్షల్లో  ఖర్చు చేస్తోంది.  జిల్లాలో ఎక్కడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అవేర్​నెస్​ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఇతర ఎన్జీఓలు, సంఘాలు నిర్వహించే బ్లడ్​ డొనేషన్​ క్యాంపులకు వెళ్లి రక్తాన్ని సేకరిస్తున్నారు.  ప్రతిరోజు 30 యూనిట్లు బ్లడ్ సేకరించాలని రూల్​ ఉన్నా.. దాన్ని సిబ్బంది పట్టించుకోవడం లేదు. రోజూ ఆస్పత్రికి వచ్చి, వెళ్లిపోతున్నారు. బ్లడ్​ కలెక్షన్​ కోసం ఉన్న వ్యాన్​ నిరూపయోగంగా మారింది. 

అవసరాన్ని బట్టి క్యాంపులు పెడతాం...

జిల్లాకు అవసరమైన బ్లడ్ యూనిట్లను బట్టి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ హెచ్​ఎం కింద అప్పాయింట్ అయిన వారు సపరేట్ గా మొబైల్ బ్లడ్ ను కలెక్ట్ చేయడం లేదు. ఎక్కువ అవసరం ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్​ క్యాంప్​ పెడుతున్నాం. 

- డాక్టర్ నవీన్ క్రాంతి,బ్లడ్ బ్యాంక్ ఇన్ చార్జి