దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎలాంటి పోటీ లేదు

దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎలాంటి పోటీ లేదు

న్యూఢిల్లీ: వెటరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తనకు ఎలాంటి పోటీ లేదని టీమిండియా బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశాడు. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవర్ని ఆడించాలనే అంశాన్ని తమ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయిస్తారని చెప్పాడు. ఇతర వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్లు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నా.. పరిస్థితులను బట్టే అవకాశాలు ఉంటాయన్నాడు. ‘కీపర్ల మధ్య పోటీ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వ్యక్తిగతంగా మేం టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 100 శాతం కష్టపడేందుకు సిద్ధంగా ఉంటాం.

మిగతా విషయాలు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసుకుంటుంది. ఏ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడిస్తే బాగుంటుందనే అంశం వాళ్ల పరిధిలోనిది’ అని పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 171 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే, కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 155 రన్సే  సాధించాడు. అయితే పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగల సమర్థుడు. కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆసియాకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇద్దర్నీ ఎంపిక చేసినా.. టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరికి మాత్రమే చోటు ఉంటుంది.