ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా.. కేంద్రం వాటా తెచ్చే బాధ్యత నాదే: కిషన్ రెడ్డి

ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా.. కేంద్రం వాటా తెచ్చే బాధ్యత నాదే: కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సీనియర్ బీజేపీ నేత లక్ష్మణ్ తో కలసి ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతోన్న డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్ రెడ్డి పరిశీలించారు.

లబ్దిదారులు ఇళ్ల నిర్మాణంపై తనను కలసి అసంతృప్తిని వ్యక్తం చేయడంతో కేంద్ర మంత్రి స్పందించారు. 2015 లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవటం ప్రభుత్వ చేతకాని తనమేనన్నారు. కేవలం ఎన్నికల‌ కోసమే టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్లను వాడుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను కూడా పక్కదోవ పట్టించారని విమర్శించారు. కేంద్ర నిధులతో మన పక్కనున్న ఆంద్రప్రదేశ్ లో  7లక్షల ఇండ్లు పూర్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో దాదాపు 20లక్షల మందికి పేదలకు ఇండ్లు లేవు.. అందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు  యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.