వ్యూహం లేకన కాంగ్రెస్ కు ఈ ఓటమి?

వ్యూహం లేకన కాంగ్రెస్ కు ఈ ఓటమి?

రాహుల్‌‌‌‌ ఈ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. దేశమంతా తిరిగారు. కానీ,  ఆయన స్పీచ్​లకు ఒక టార్గెట్​, ఒక గోల్​ అనేది లేకుండా పోయింది. రాఫెల్​ స్కాంని పదే పదే ప్రస్తావించినా చివరివరకు నిలబడలేకపోయారు.  ‘చౌకీదార్​ ఛోర్​ హై’ విమర్శపై సుప్రీంకోర్టు సీరియస్​ అవటంతో ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. మొదట్లోనే తేల్చేసే ఛాన్స్​ ఉన్నా వాడుకోలేదు. ‘బీజేపీకి బదులు కాంగ్రెస్​ని ఎందుకు ఎన్నుకోకూడదు’ అని ఓటర్లు అనుకునేలా కన్విన్స్​ చేయలేకపోయారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. స్పెషల్‌‌‌‌ సెషన్‌‌‌‌ ఏర్పాటు చేసి, గ్రాస్‌‌‌‌రూట్‌‌‌‌ లెవెల్‌‌‌‌ క్యాడర్‌‌‌‌లో ఆత్మవిశ్వాసం నింపగలిగితే చాలు. కానీ, ఆ పని రాహుల్‌‌‌‌ వల్ల సాధ్యమా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

తాజా లోక్​సభ ఎన్ని కల్లో కాంగ్రెస్​ పార్టీ ఫెయిల్యూర్​తో ఇప్పడు ఆ పార్టీలోని అన్ని వేళ్లూ రాహుల్​గాంధీ వైపే చూపుతున్నాయి. జనరల్​ ఎలక్షన్ ఫైట్​ ప్రారంభమైన మొదటి రోజు నుం చీ ఆయన అన్​ఫిట్​గా, అయిష్టం గానే కనిపించారు. ఫలితంగా దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే, అందులో 12 చోట్ల కాంగ్రెస్​కి ఒక్క సీటు కూడా రాకపోవటంతో పాటు మరో 11 చోట్ల ఒక్కొక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అలా అని రాహుల్​గాంధీ ఈ ఎన్నికల సమరాన్ని లైట్​ తీసుకున్నారా అంటే కాదనే చెప్పాలి. ఆయన దేశం మొత్తం తిరిగి ఎలక్షన్​ క్యాంపెయిన్​ నిర్వహించారు. చాలా కష్టపడ్డారు. పోరాడారు. కానీ అది ఫలించలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రచారంలో ఏ అంశాలపై ఎక్కువగా మాట్లాడాలనే క్లారిటీ లోపించింది. ఆయన స్పీచ్​లకు ఒక టార్గెట్​, ఒక గోల్​ అనేది లేకుండా పోయింది. రాఫెల్​ స్కాం గురించే పదే పదే ప్రస్తావించారు. కానీ ఆ ఆరోపణలకు పక్కాగా రుజువులు చూపలేకపోయారు.  మొత్తానికి సరైన వ్యూహం లేకనే ఇలాంటి పరాజయం చవిచూడాల్సి వచ్చిందని పొలిటికల్​ ఎనలిస్టులు అంటున్నారు.లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఫెయిల్యూర్​తో ఇప్పడు ఆ పార్టీలోని అన్ని వేళ్లూ రాహుల్​గాంధీ వైపే చూపుతున్నాయి. జనరల్​ ఎలక్షన్ ఫైట్​ ప్రారంభమైన మొదటి రోజు నుంచీ ఆయన అన్​ఫిట్​గా, అయిష్టంగానే కనిపించారు. ఫలితంగా దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే, అందులో 12 చోట్ల కాంగ్రెస్​కి ఒక్క సీటు కూడా రాకపోవటంతోపాటు మరో 11 చోట్ల ఒక్కొక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఎన్నికల వేళ అనుకోని వివాదం

‘చౌకీదార్​ ఛోర్​ హై’ విమర్శ​ మినహా మరో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. దీంతో మోడీని విమర్శించటం తప్ప రాహుల్​కు మరో పని లేదనే చెడ్డ పేరు వచ్చింది. అంతేకాదు. కాపలాదరునని చెప్పుకునే వ్యక్తే అసలు దొంగ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటూ తనకుతానే తేల్చేశారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానం ఆ మాట అనకపోయినా అన్నట్లు జనం భావించటానికి కారణమయ్యారు. ఇదొక వివాదంగా మారింది. సుప్రీంకోర్టు సీరియస్​ అవటంతో చివరికి రాహుల్​గాంధీయే సారీ చెప్పాల్సి వచ్చింది. ఎన్నికల వేళ ఊహించని ఈ పరిణామం కాంగ్రెస్​ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. ఈ విషయాన్ని ఇంత దూరం లాక్కుండా మొదట్లోనే తేల్చేసే ఛాన్స్​ ఉన్నా వాడుకోలేదు.

సిద్ధాంతాలను సొంతం చేసుకోలేక..

ఐడియాలజీ విషయానికి వస్తే రాహుల్​గాంధీ హిందూయిజాన్ని సొంతం చేసుకోలేకపోయారు. మతం అనే ఒక పెద్ద ఇష్యూని రాజకీయ కోణంలో మనస్ఫూర్తిగా డీల్​ చేయలేకపోయారు. గుళ్లూగోపురాలు బాగానే తిరిగి యజ్ఞాలూ యాగాలు చేశారు కానీ ‘అయోధ్యలో రాముడి గుడి’ గురించి ఒక్క ముక్కైనా మాట్లాడలేదు. తన కుటుంబ పెద్దలు; లెజెండ్ లీడర్లు అయిన జవహర్​లాల్​నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ వ్యక్తిగత, రాజకీయ జీవితాలను ఒకసారి తిరగేస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఇండిపెండెన్స్​కి ముందు, తర్వాత కాంగ్రెస్​ పార్టీ ఎక్కువగా రైట్​ వింగ్​ ఐడియాలజీనే ఫాలో అయినట్లు గమనించొచ్చు. గ్రాండ్​ ఓల్డ్​ పార్టీకి చీఫ్​గా రాహుల్​గాంధీ ఈ దిశగా కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1948లో కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఆచార్య కృపలానీ ఇండియా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ ముస్లిం దేశం పాకిస్థాన్​లో పర్యటించి అక్కడి హిందువుల స్థితిగతులను చూసొచ్చారు. వాళ్ల ప్రయోజనాలను కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఎంతగా పట్టించుకుందో ఈ సంఘటన తెలియజేస్తోంది.

‘మోడీ నాయకత్వంలోని బీజేపీకి బదులు కాంగ్రెస్​ పార్టీని తామెందుకు ఎన్నుకోకూడదు’ అని ఓటర్లు అనుకునేలా ఏఐసీసీ సుప్రీం రాహుల్​గాంధీ కన్విన్స్​ చేయలేకపోయారు. దేశంలో మెజారిటీ కమ్యూనిటీ అయిన హిందువుల ఆకాంక్షలను తానూ నెరవేర్చగలననే నమ్మకాన్ని వాళ్లకు కల్పించలేకపోతున్నారు. యూపీలోని చాలా మంది కాంగ్రెస్​ పార్టీ లీడర్లు బాబ్రీ గురించి, రామజన్మభూమి గురించి పెదవి విప్పరు. అదే వాళ్లకు పెద్ద లోటుగా మారింది.

ఇప్పటికైనా తొందరేం లేదు

అయితే.. ఈ లోపాన్ని సరిచేయటానికి రాహుల్​గాంధీకి ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. ఏఐసీసీ స్పెషల్​ సెషన్​ను​ ఏర్పాటు చేసి, గ్రాస్​ రూట్​ వర్కర్ల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. అయోధ్య వంటి సున్నిత అంశాలపై పార్టీ విధానాన్ని స్పష్టం చేసే తీర్మానాన్ని రూపొందించొచ్చు. ఇలాంటి వివాదాస్పద విషయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా వ్యవహరించాలో దారిచూపొచ్చు. తద్వారా కేడర్​లో విశ్వాసాన్ని నింపి భవిష్యత్​ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయొచ్చు.

సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక.. ఈ ముగ్గురూ కాంగ్రెస్​ పార్టీకి ట్రస్టీలుగానే భావిస్తున్నారు తప్ప పార్టీని అధికారంలోకి తేవాలని గానీ, దేశాన్ని ఏలాలని గానీ కోరుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ ప్రధానులు కావటం వల్లే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారనే భయమో, మరో కారణమో గానీ ఈ తరహా ఆలోచనలు కాంగ్రెస్​ పార్టీని నైతికంగా కోలోకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని పార్టీ లీడర్లు కూడా విస్మరిస్తున్నారనే టాక్​ వినిపిస్తోంది.

కాంగ్రెస్​ కార్యకర్తలు, నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ప్రశ్నించే సాహసం చేయరు. వాళ్లు మాత్రమే పార్టీని గెలిపించగలరని, అధికారం అందించగలరని అనుకుంటారు. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వరకూ ఇలాగే జరిగింది. రాహుల్​గాంధీ విషయంలోనే రివర్స్​ అయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ బయటి వ్యక్తి హైకమాండ్​గా రావాలని డిమాండ్​ చేయకపోవచ్చు. దీనికి బదులుగా ప్రియాంకకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని అడిగితే అడగొచ్చేమో.

ప్రియాంకకు బాధ్యతలు

సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక.. ఈ ముగ్గురూ కాంగ్రెస్​ పార్టీకి ట్రస్టీలుగానే భావిస్తున్నారు తప్ప పార్టీని అధికారంలోకి తేవాలని గానీ, దేశాన్ని ఏలాలని గానీ కోరుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ ప్రధానులు కావటం వల్లే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారనే భయమో, మరో కారణమో గానీ ఈ తరహా ఆలోచనలు కాంగ్రెస్​ పార్టీని నైతికంగా కోలోకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని పార్టీ లీడర్లు కూడా విస్మరిస్తున్నారనే టాక్​ వినిపిస్తోంది.

కాంగ్రెస్​ కార్యకర్తలు, నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ప్రశ్నించే సాహసం చేయరు. వాళ్లు మాత్రమే పార్టీని గెలిపించగలరని, అధికారం అందించగలరని అనుకుంటారు. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వరకూ ఇలాగే జరిగింది. రాహుల్​గాంధీ విషయంలోనే రివర్స్​ అయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ బయటి వ్యక్తి హైకమాండ్​గా రావాలని డిమాండ్​ చేయకపోవచ్చు. దీనికి బదులుగా ప్రియాంకకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని అడిగితే అడగొచ్చేమో.