
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని తెలిపింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని టాక్ వినిపించడంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం అత్యధిక లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చార్జీలు విధించడం లేదని చెప్పడంతో వినియోగదారులకు ఊరట లభించినట్లు అయ్యింది.
There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means: Ministry of Finance on reports of imposing extra charges to be paid for every UPI payment pic.twitter.com/d3u49lOpZT
— ANI (@ANI) August 21, 2022
యూపీఐ అనే డిజిటల్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సులభంగా సౌకర్యవంతంగా ఉందని ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. అందువల్ల యూపీఐ సేవలపై ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపింది. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్లు ఇతర మార్గాల ద్వారా తమ ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని సూచించింది. డిజిటల్ పేమెంట్స్ పర్యావరణ వ్యవస్థకు కేంద్రం గతేడాది ఆర్థిక సాయం చేసింది. ఈ ఏడాది కూడా అదే సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.