పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు సినీ నటుడు ఎన్టీఆర్. మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రోమో విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన రాజకీయాలపై స్పందించారు. రాజకీయాల్లోకి ఇప్పట్లో రాబోనని... ఇది సమయం కాదన్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి మాట్లాడుకుందామన్నారు. వేడి వేడి కాఫీ తాగుతూ రాజకీయాలపై మాట్లాడుకుందామన్నారు.
త్వరలో జెమినీ టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరులు షో అనేది మనీ కోసం కాదన్నారు ఎన్టీఆర్. మనీ సెక్యూరిటీ ఇస్తుందని.. ఈ షో ఏ విధంగా సక్సెస్ అవుతుందో ఉత్కంఠగా ఉందని తెలిపారు.