![మంత్రి సీతక్కను కలిసిన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు](https://static.v6velugu.com/uploads/2023/12/52_tj9bvzLlM2.jpg)
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్ఎస్ యూఐ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రంగినేని శాంతన్ రావు శుక్రవారం రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని జిల్లాలో పర్యటించాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు శాంతన్ తెలిపారు