
ముంబై: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) షేర్లు మంగళవారం సెషన్లో 2 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 3 లక్షల కోట్లు దాటింది. ఇంట్రాడేలో రూ.313 దగ్గర ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి రూ. 310 దగ్గర సెటిలయ్యింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 84 శాతం రిటర్న్ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీల్లో ఎన్టీపీసీ 20 ప్లేస్కు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.17.30 లక్షల కోట్లతో మొదటి ప్లేస్లో కొనసాగుతోంది. ఆ తర్వాత టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టాప్ 5 లో ఉన్నాయి.