Jr.Ntr, Prashanth Neel: ప్రభాస్ బాటలోనే ఎన్టీఆర్.. ప్రశాంత్ మూవీ కోసం క్రేజీ డెసిషన్

Jr.Ntr, Prashanth Neel: ప్రభాస్ బాటలోనే ఎన్టీఆర్.. ప్రశాంత్ మూవీ కోసం క్రేజీ డెసిషన్

జూనియర్ ఎన్టీఆర్(Ntr) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ(Koratala Shiva)తో దేవర(Devara) మూవీ చేస్తున్న ఆయన.. ఈ సినిమా తరువాత బాలీవుడ్ మూవీ వార్ 2(War2)లో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

ఈ కాంబోలో ప్రాజెక్టు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ మిగతా ఏ సినిమాలకు లేనంతగా ఈ సినిమాకు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతోంది. కారణం కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడం. అందుకే ఈ సినిమా కోసం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడంలేదు. 

తాజాగా ఈ సినిమా గురించి మరోన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రభాస్ బాటలోనే నడవనున్నాడట ఎన్టీఆర్. బాహుబలి, సాలార్ లాగే ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కూడా రెండు పార్టులుగా రానుందట. కథా పరంగా పెద్ద స్పాన్ ఉండటం, పాత్రలు కూడా చాలా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట ప్రశాంత్ నీల్. దానికి ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పేశాడట. ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తతం ఎన్టీఆర్ చేస్తున్న దేవర కూడా రెండు పార్టులుగా రానుంది. ఇక మరోసారి ప్రశాంత్ నీల్ కోసం కూడా అదే డెసిషన్ ను తీసుకున్నాడట ఎన్టీఆర్. దీంతో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దేవర విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తోపాటు మరో మరాఠి భామ కూడా నటిస్తున్నారు. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.