NTR మహానాయకుడు ట్రైలర్ విడుదల

NTR మహానాయకుడు ట్రైలర్ విడుదల

నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ట్రైలర్ విడుదలైంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంది. సినిమా హీరోగా ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా చూపించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి… ప్రజా నాయకుడిగా… పేదల పక్షపాతిగా.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా… ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది.

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు.. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అనే ఎన్టీఆర్ డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది.

ఫిబ్రవరి 22న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అంతటా విడుదల కాబోతోంది. సినిమాకు క్లీన్ యు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని దర్శక నిర్మాతలు తెలిపారు.