హీరో సిద్ధార్థ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్ చేసిన కామెంట్లపై స్పందించిన నేషనల్ ఉమెన్స్ కమిషన్ ఘాటుగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్డబ్ల్యూ సీ సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ సెల్కు లేఖ రాసింది. ఆయన చేసిన కామెంట్లు స్త్రీ ద్వేషిగా, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఎన్డబ్ల్యూ సీ చైర్పర్సన్ రేఖా శర్మ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సిద్ధార్థ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ముంబై డీజీపీని కోరింది. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర కామెంట్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల పంజాబ్లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రిప్లై ఇచ్చారు. దీనిపై దుమారం రేగడంతో తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సిద్ధార్థ్ మరో ట్వీట్ చేశారు.
National Commission for Women chairperson writes to Twitter India "to immediately block actor Siddharth's tweet on shuttler Saina Nehwal, calls it "misogynist and outrageous."
— ANI (@ANI) January 10, 2022
The actor later said, "Nothing disrespectful was intended, reading otherwise is unfair." pic.twitter.com/ln6SCBs9fG
For more news..
అంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు
నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో మలుపు