ఇండియా vs పాకిస్తాన్ టికెట్లపై ఆఫర్.. రూ.10వేల టికెట్ రూ.1500

ఇండియా vs పాకిస్తాన్ టికెట్లపై ఆఫర్.. రూ.10వేల టికెట్ రూ.1500

సాధారణంగా భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం సహజం. చాలా మంది అభిమానులు టికెట్ రేట్ ఎంతైనా సరే కొనడానికి వెనుకాడరు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనపడుతుంది. శ్రీలంకలోని పల్లకెల స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ కి టికెట్ల ధర ఇప్పుడు ఊహించని స్థాయిలో ఉండడం విశేషం. టికెట్ల విషయంలో అభిమానులకి ఆఫర్ లో ఇండియా, పాక్ మ్యాచ్ టికెట్లు అమ్మడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 రూ.10వేల టికెట్ రూ.1500:

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం శ్రీలంక రూ.10 వేల టికెట్ రూ.1500కే అమ్ముతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ వైపు వరల్డ్ కప్ లో టికెట్లు దొరకడం కష్టంగా మారుతున్న తరుణంలో శ్రీలంకలో మాత్రం చాలా తక్కువ ధరకి దొరకడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టోర్నీ హోస్ట్ అయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ లిమిటెడ్ టైమ్ స్పెషల్ ఆఫర్ ను దక్కించుకోవాలని అభిమానులను కోరింది. పల్లెకెలె స్టేడియంలోని పచ్చికపై కూర్చొని మ్యాచ్ చూడాలనుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో భాగంగా శ్రీలంకలోని రూ.9600 టికెట్ ను కేవలం రూ.1500కే ఇస్తున్నట్లు పాక్ బోర్డు వెల్లడించింది.

భారత్-నేపాల్ మ్యాచ్ కి కూడా.. 

ఈ ఆఫర్ కేవలం భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కే  కాదు టీమిండియా తదుపరి నేపాల్ తో ఆడబోయే లీగ్ మ్యాచులో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్ చూడాలనుకునే వారు 2560 రూపాయలు చెల్లిస్తే చాలని మరో ఆఫర్ కూడా ఇచ్చింది. క్యాండీలో స్టేడియం దగ్గర ఉన్న బాక్సాఫీస్ లో ఈ టికెట్లను అప్పటికప్పుడు కొనుగోలు చేయొచ్చు. క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆఫరని  చెప్పాలి.