సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ను రిపీట్ చేయడం చూస్తూనే ఉంటాం. తాజాగా మరో హిట్ కాంబోపై టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్(Ram Charan), సుకుమార్(Sukumar) లాంటి క్రేజీ కాంబో మరోసారి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో ఆరేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం(Rangasthalam) సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో చరణ్ కోసం మరో డిఫరెంట్ కాన్సెప్ట్ను సిద్ధం చేశారట సుకుమార్. ఇప్పటికే కథను విన్న చరణ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్కు వెళ్లాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్లో నటించాల్సి ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జూన్ నుంచి స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారట. అలాగే సుకుమార్ కూడా ‘పుష్ప2’ చిత్రాన్ని పూర్తి చేసి పనిలో ఉన్నారు. వీటి తర్వాతే చరణ్, సుకుమార్ కాంబో సెట్స్కు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.