ఏకగ్రీవ పంచాయతీల్లో ఆఫీసర్ల విచారణ

ఏకగ్రీవ పంచాయతీల్లో ఆఫీసర్ల విచారణ

లింగంపేట, వెలుగు: మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలైన పంచాయతీల్లో గురువారం  ఎంపీడీవో నరేశ్, తహసీల్దార్ సురేశ్, ఎస్సై దీపక్​కుమార్ విచారణ చేపట్టారు. మండలంలో 12 గ్రామపంచాయతీల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని సజ్జన్​పల్లి,అయ్యపల్లితండా,మాలోత్​తండా, మాలోత్ సంగ్యానాయక్​తండాలో విచారణ జరిపారు. 

సర్పంచ్​, వార్డు సభ్యుల స్థానాలకు ఎందుకు సింగిల్​ నామినేషన్లు దాఖలు చేశారు? ఎవరైనా భయబ్రాంతులకు గురిచేశారా? డబ్బులు ఆశ చూపారా.. అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  ఏకగ్రీవమైతే ప్రభుత్వం నుంచి నిధులు వస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని ప్రజలు చెప్పినట్లు అధికారులు తెలిపారు.