![పెబ్బేరు మండలంలో.. ఇసుక డంప్లు సీజ్](https://static.v6velugu.com/uploads/2024/02/officials-seized-the-illegally-stored-sand-dump-in-pebbair-mandal_ulfJtSaF3q.jpg)
పెబ్బేరు, వెలుగు : మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్లను అధికారులు సీజ్ చేశారు. 624 ట్రాక్టర్ల ఇసుక డంప్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. తహసీల్దార్ లక్ష్మి, ఆర్ఐ రాఘవేంద్ర, మైనింగ్, కలెక్టరేట్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు.