ఓఎన్​జీసీకి రూ.8,764 కోట్ల లాభం

ఓఎన్​జీసీకి రూ.8,764 కోట్ల లాభం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్​ నేచురల్​ గ్యాస్​ కార్పొరేషన్​ (ఓఎన్​జీసీ) గత సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​లో రూ.8,764 కోట్ల లాభం సంపాదించింది. అంతకుముందు సంవత్సరం క్యూ3 లాభం రూ.1,258 కోట్లతో పోలిస్తే ఇది 596.7 శాతం పెరిగింది. చమురు, గ్యాస్​ ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. తాజాగా క్వార్టర్​లో చమురు పీపా ధర 75.73 డాలర్లు కాగా, ఇది అంతకుముందు ఏడాది క్యూ3లో 43.20 డాలర్లు ఉండేది. గ్యాస్​ ధర ఒక్కో మిలియన్ బ్రిటిష్​ థర్మల్​ యూనిట్​కు 1.79 డాలర్ల నుంచి 2.90 డాలర్లకు పెరిగింది. అయితే ఆయిల్ ప్రొడక్షన్​3.2 శాతం తగ్గి 5.45 మిలియన్​ టన్నులకు పడిపోయింది. గ్యాస్ తయారీ 4.2 శాతం తగ్గి 5.5 బిలియన్ క్యూబిక్​ మీటర్లకు పడిపోయింది. కొవిడ్​, తౌట్కే తుఫాన్​, సాగర్​ సామ్రాట్​ యూనిట్​ ప్రారంభం ఆలస్యం కావడం, హజీరాలో నిర్మాణ పనులు జరుగుతుండం, వశిష్ట ఫీల్డ్​లో రిజర్వాయర్​ సమస్యల కారణంగా ప్రొడక్షన్​ తగ్గింది.