హైదరాబాద్, వెలుగు: ముంబై కేంద్రంగా పనిచేసే ఓజీకేర్ సిటీలోని పలు ప్రభుత్వ ఆస్తులను శుభ్రపరిచే (డిస్ఇన్ఫెక్షన్) కాంట్రాక్టులను దక్కించుకుంది. ఓజోన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను వినియోగించడం ద్వారా మాల్స్, హోటల్స్, హాస్పిటల్స్వంటి రద్దీ ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా చేస్తామని తెలిపింది.
ఓజీకేర్ ఎల్ అండ్ టీ మెట్రో హైదరాబాద్తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో హైదరాబాద్ సర్వీస్ యార్డులో మొబిజోన్ను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల మెట్రో కార్స్ను అత్యంత వేగంగా డిస్ఇన్ఫెక్షన్ చేయవచ్చు. ఈ టెక్నాలజీతో సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఈ టెక్నాలజీతో 10 నిమిషాల సమయంలోనే రైలును శానిటైజ్ చేయవచ్చు. ఇందుకోసం ఎలాంటి హానికారక రసాయనాలను వాడమని ఓజీకేర్ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లోనూ శానిటైజ్ యూనిట్లను వాష్రూమ్లలో ఏర్పాట్లు చేయనుంది. దీనిద్వారా వేగంగా చెడు వాసనలను పోగొట్టడంతో పాటుగా వాష్ రూమ్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచవచ్చు. కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలిలోని ఓక్ఉడ్ హోటల్స్కు సైతం ఇలాంటి సేవలను అందిస్తున్నామని కంపెనీ ఈ సందర్భంగా ప్రకటించింది.