ఓలా ఎలక్ట్రిక్​కు 3 వేల 200 కోట్ల ఫండింగ్​

ఓలా ఎలక్ట్రిక్​కు 3 వేల 200 కోట్ల ఫండింగ్​

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్  గురువారం రూ.3,200 కోట్లు సేకరించింది. టెమాసెక్‌‌‌‌ నేతృత్వంలోని  ఇన్వెస్టర్లు, ఎస్‌‌‌‌బీఐ నుంచి ఈ ఫండ్స్ సేకరించింది.  ఎలక్ట్రిక్ బిజినెస్‌‌‌‌ను  విస్తరించడానికి, దేశంలోనే మొదటి లిథియం అయాన్  సెల్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి  ఈ ఫండ్స్ వాడనున్నారు. 

ఓలా ఎలక్ట్రిక్‌‌‌‌ తమిళనాడులోని కృష్ణగిరి దగ్గర ఈ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ తన టూవీలర్ల తయారీ సామర్ధ్యాన్ని వేగంగా పెంచుతోంది. ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చే పనిలో ఉంది.