
హైదరాబాద్, వెలుగు: ఓఎం సిస్టమ్ ఇండియాలో రెండు కొత్త ఇమేజింగ్ ప్రొడక్టులను విడుదల చేసింది. వైల్డ్లైఫ్, మాక్రో, పక్షుల ఫొటోగ్రఫీ కోసం రూపొందించిన ఓఎం-5 మార్క్-2 ఇంటర్ ఛేంజబుల్ లెన్స్ కెమెరాతోపాటు ఎం.జ్యూయికో డిజిటల్ ఈడీ 50-200ఎమ్ఎమ్ ఎఫ్2.8 ఐఎస్ ప్రో లెన్స్ను విడుదల చేసింది.
పండుగల సీజన్లో విడుదలైన ఈ ఓఎం-5 మార్క్-2 ఇంటర్ఛేంజ్డ్ లెన్స్ కెమెరాను ఔట్డోర్ ఫొటోగ్రఫీ ప్రియుల కోసం డిజైన్ చేశారు. ఇది తేలికగా ఉంటుంది. ఐపీఎక్స్53 రేటింగ్ ఉంది. క్లాస్-లీడింగ్ 5-యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్, కొత్తగా డిజైన్ చేసిన గ్రిప్ లాంటివి ఉన్నాయి.
ఓఎం-5 మార్క్-2, 14-150ఎమ్ఎమ్ కెమెరా ధర రూ.1,39,990 కాగా, ఎం.జ్యూయికో డిజిటల్ ఈడీ 50-200ఎమ్ఎమ్ ఎఫ్2.8 ఐఎస్ ప్రో లెన్స్ ధరను రూ.3,29,990గా నిర్ణయించారు.