తెలంగాణ జాబ్స్ స్పెషల్ : మిలిటరీ పాలన.. బిట్ బ్యాంక్

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : మిలిటరీ పాలన.. బిట్ బ్యాంక్

* 1948 సెప్టెంబర్​ 18న హైదరాబాద్​లో మిలిటరీ గవర్నర్​గా జయంత్​నాథ్​ చౌదరి పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. 

*  దేశంలోనే అతిపెద్ద బ్రిటీష్​ సైనిక స్థావరమైన సికింద్రాబాద్​ బైసన్ డివిజన్​లో జేఎన్​ చౌదరి పనిచేశారు. 

* ఆపరేషన్​ పోలోకు ఆపరేషన్​ కాటర్​పిల్లర్​ అనే మరో పేరుంది. 

* 1938లో బ్రిటీష్​ ఆర్మీ సికింద్రాబాద్​ డివిజన్​కు, నిజాం సైన్యానికి మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి. 

*  ఆపరేషన్​ పోలో సమయంలో భారత సైన్యానికి ముఖ్యంగా జేఎన్​ చౌదరికి నిజాం రాజ్య సైన్యాధిపతి మేజర్​ జనరల్​ ఇ.ఎల్. ఎడ్రూస్ సహాయపడ్డాడు. 

*  1948 సెప్టెంబర్​ 24 నుంచి 1949 డిసెంబర్​ 31 వరకు హైదరాబాద్​లో మిలటరీ గవర్నర్​ కార్యనిర్వాహక మండలి. 1. మిలటరీ గవర్నర్​ జేఎన్​ చౌదరి, 2. చీఫ్​ సివిల్​ అడ్మినిస్ట్రేటర్​ డి.ఎస్​. బాక్లే, 3. అడిషనల్​ చీఫ్​ సివిల్​ అడ్మినిస్ట్రేటర్​ డి.ఆర్​.ప్రధాన్​(ఐసీఎస్​). 

*  మిలటరీ గవర్నర్​ పాలనా కాలంలో పరిపాలన రాజ్యాధినేతగా నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ పేరు మీద జరిగేది. 

*  నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ రాజ్​ప్రముఖ్​గా 1950 జనవరి 26న నియమింపబడ్డాడు. 

* 1949 ఫిబ్రవరి 6న నిజాం సొంత ఆస్తిగా భావించే సర్ఫేఖాస్​, నిజాం రాజ్య కరెన్సీ హాలిసిక్కాను రద్దు చేశారు. 

*  హైదరాబాద్​ రాజ్యంలో అంతకుముందు ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు దినంగా ఉండేది. 

* 1949 ఫిబ్రవరి 6న విడుదల చేసిన ఫర్మానా ప్రకారం సెలవు దినం శుక్రవారం నుంచి ఆదివారానికి మార్చారు. 

* నిజాం కు చెందిన సర్ఫేఖాస్​ భూములను స్వాధీనం చేసుకున్న భారత ప్రభుత్వం అందుకు నష్టపరిహారంగా రూ.3కోట్ల ధనం చెల్లించింది. 

* హైదరాబాద్​లో ఉన్ జాగిర్దారీ వ్యవస్థ మిలటరీ గవర్నర్​ జె.ఎన్​.చౌదరి కాలంలో రద్దయింది. 

*  భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వం భూములున్న నగరంగా హైదరాబాద్​ పేరొందింది. 

*  హైదరాబాద్​ రాష్ట్రంలో ఫసలీ నెలలు రద్దయి, వాటి స్థానంలో ఇంగ్లీష్​ నెలలు 1946 అక్టోబర్​లో వాడుకలోకి వచ్చాయి. 

*  జేఎన్​ చౌదరి పాలనా కాలంలో ఆయన కింద సివిల్​ అడ్మినిస్ట్రేట్​ అనే పౌర పరిపాలన శాఖ ఏర్పాటు చేయబడింది. 

* జేఎన్​ చౌదరి పాలనా కాలంలో సివిల్​ అడ్మినిస్ట్రేట్​కు అత్యున్నతాధికారి చీఫ్​ సివిల్​ అడ్మినిస్ట్రేటర్​ (ఇతనికి దాదాపు ముఖ్యమంత్రి హోదా ఉండేది).

 * కమ్యూనిస్టులు రెండో దశ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 1947 సెప్టెంబర్ 11న పిలుపునిచ్చింది. 

* కమ్యూనిస్టులపై భారత సైన్యం ఊచకోత 1951 అక్టోబర్​ 21 వరకు కొనసాగింది. 

* హైదరాబాద్​ రాష్ట్రంలో జాగీర్దారు విధానాన్ని 1949 ఆగస్టులో రద్దు చేశారు. 

* ముస్లింలపైన జరిగిన దాడులను విచారించడానికి 1949 అక్టోబర్​లో భారత ప్రభుత్వం పండిట్​ సుందర్​లాల్​ కమిటీని ఏర్పాటు చేసింది. 

*  పండిట్​ సుందర్​లాల్​ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి 1949 డిసెంబర్ 21న నివేదిక సమర్పించింది. 

*  ఆపరేషన్​ పోలో పేరుతో హైదరాబాద్​పై జరిగిన పోలీసు చర్య సమయంలో, తదనంతరం దాదాపు 20000 నుంచి 40000 మంది ప్రజలు మరణించారని సుందర్​లాల్​ కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

* సుందర్​లాల్​ కమిటీ నివేదిక అనంతరం కేంద్ర ప్రభుత్వం జేఎన్​ చౌదరిని 1949 డిసెంబర్ 31న తొలగించింది. 

* సుందర్​లాల్​ కమిటీ నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్​ మ్యూజియంలోని లైబ్రరీలో భద్రపరిచారు. 

* జేఎన్​ చౌదరి తర్వాత 1950 జనవరి 1 నుంచి హైదరాబాద్​ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐసీఎస్ అధికారి ఎం.కె.వెల్లోడిని నియమించారు. 

* ఎంకే వెల్లోడి మంత్రివర్గంలోని సభ్యులు. ఎం.శేషాద్రి, సి.వి.ఎస్​.రావు, నవాజ్​ జైన్​ యార్జంగ్, బూర్గుల రామకృష్ణారావు, పూల్​చంద్​ ప్రేమ్​చంద్ గాంధీ, వినాయకరావు కొరాట్కర్​, వి.బి.రాజు. 

 * ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వామి రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి పార్లమెంట్​కు నామినేట్​ చేయబడ్డారు. 

*  1950 జనవరి 1 నుంచి 1952 జనవరి 31 వరకు వెల్లోడి మంత్రి మండలి పాలన సాగించింది. 

* 1949 ఫిబ్రవరిలో నిజాం నవాబు – భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నిజాంకు వివిధ ఖర్చుల కోసం రూ.1.50కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.

* హైదరాబాద్​ రాజ్యంలో పౌర ప్రభుత్వం ఏర్పడిందని, నిజాం రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్నాడని 1949లో ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి రామస్వామి మొదలియార్​ ప్రకటించారు.