కార్తికమాస చివరి సోమవారం.. ఆలయాల్లో భక్తుల రద్దీ

కార్తికమాస చివరి సోమవారం.. ఆలయాల్లో భక్తుల రద్దీ

కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శ్రీశైలంతో పాటు ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. దీంతో విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద రద్దీ నెలకొంది. రాజమహేంద్రవరం, భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీపాలను వెలిగించి నదుల్లో వదిలారు. 

ఇటు తెలంగాణలోనూ ప్రముఖ శైవక్షేత్రాల్లో రద్దీ కొనసాగుతోంది. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.