ఇండోనేషియా సముద్రంలో నౌక గల్లంతు.. నౌకలో 240 మంది ప్రయాణికులు

ఇండోనేషియా సముద్రంలో నౌక గల్లంతు.. నౌకలో 240 మంది ప్రయాణికులు

ఇండోనేషియా జావా సముద్రంలో నౌక గల్లంతైంది. నౌకలో 240 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్ నుంచి బోర్నియో ద్వీపంలోని దక్షిణ కాలిమంటన్‌కు ప్రయాణిస్తున్న సుమారు 240 మంది ప్రయాణికుల ఓడతో జావా సముద్రంలో సంబంధాలు తెగిపోయాయి.

ఆ ఓడను.. అందులోని ప్రయాణికులను గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోవడంతో ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఓడ సంబంధాలు కోల్పోయింది.

వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 పేరుతో నడుస్తున్న ఈ ప్రయాణీకుల నౌక, ఇండోనేషియాలోని రెండవ అతిపెద్ద నగరమైన సురబయ నుంచి దక్షిణ కాలిమంటన్ రాజధాని అయిన బంజర్‌మాసిన్ వైపు ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో ఆ నౌకలో సమాచార లోపం తలెత్తినట్లు తమకు సమాచారం అందిందని బంజర్‌మాసిన్ శోధన, రక్షణ కార్యాలయం తెలిపింది. ఆ నౌక చివరిగా బంజర్‌మాసిన్‌లోని ఒక రేవు నుంచి సుమారు 148 కిలోమీటర్ల దూరంలో జావా సముద్రంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఆ నౌక స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:13 గంటలకు సురబయ నుంచి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా సంబంధాలు తెగిపోయిన ఈ ఇండోనేషియా నౌకలో ఒకరు మృతి చెందగా, 102 మందిని రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.