జులై 31 నాటికి వన్ నేషన్-వన్ రేషన్

జులై 31 నాటికి వన్ నేషన్-వన్ రేషన్

న్యూఢిల్లీ: వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు జులై 31 నాటికి వన్ నేషన్-వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఆహారధాన్యాల సరఫరా చేయాలని సూచించింది. జూలై 31 వరకు అన్ని రాష్ట్రాలు వలస కూలీల కు డ్రై రేషన్ అందించేందుకు ఓ పథకాన్ని రూపొంచాలని తెలిపింది. ఎక్కువ సంఖ్యలో వలస కూలీలు ఉన్న దగ్గర కరోనా సంక్షోభం ముగిసే వరకు కమ్యూనిటీ కిచెన్స్ ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు.