శ్రీనగర్: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని నదిగామ్ లో టెర్రరిస్టులు పొంచి ఉన్నారనే సమాచారం అందడంతో కశ్మీర్ పోలీసులతో కలసి భద్రతా దళాలు సోదా నిర్వహించాయి. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ పై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చనిపోయిన టెర్రరిస్టు వివరాలు ఇంకా తెలియరాలేదు. మిగిలిన టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
One terrorist killed in the Shopian encounter that broke out between terrorists and security forces in Nadigam area of Shopian, J&K earlier today.
— ANI (@ANI) February 2, 2022
Visuals deferred by unspecified time. pic.twitter.com/2kwf5DmJEg
మరిన్ని వార్తల కోసం: