భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి

భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి

శ్రీనగర్: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని నదిగామ్ లో టెర్రరిస్టులు పొంచి ఉన్నారనే సమాచారం అందడంతో కశ్మీర్ పోలీసులతో కలసి భద్రతా దళాలు సోదా నిర్వహించాయి. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ పై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చనిపోయిన టెర్రరిస్టు వివరాలు ఇంకా తెలియరాలేదు. మిగిలిన టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం:

క్రీజులో కుదురుకుంటే అతడ్ని ఆపడం కష్టం

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

చింతామణి నాటక నిషేధంపై హైకోర్టు సీరియస్