కొనసాగుతున్న టీనేజర్ల కరోనా వ్యాక్సినేన్ రిజిస్ట్రేషన్లు

 కొనసాగుతున్న టీనేజర్ల కరోనా వ్యాక్సినేన్ రిజిస్ట్రేషన్లు

టీనేజర్లకు కరోనా వ్యాక్సినేన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.. నిన్నటి నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభమైంది. కోవిన్ వెబ్ సైట్ లో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలను వైద్యారోగ్యశాఖ వెబ్ సైట్ లో నమోదు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో 12 ప్రభుత్వ దవాఖానాలు, 16 ప్రైవేట్ దవాఖానాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా వ్యాక్సిన్ వేయగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1400 రూపాయలు తీసుకోనున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.