బాల్క సుమన్​కు ఆన్​లైన్​లో పీహెచ్​డీ వైవా

బాల్క సుమన్​కు ఆన్​లైన్​లో పీహెచ్​డీ వైవా
  • బాల్క సుమన్​కు ఆన్​లైన్​లో పీహెచ్​డీ వైవా
  • ముందు ఆఫ్​లైన్​లో  షెడ్యూల్ ఇచ్చిన ఓయూ 
  • ఆ తర్వాత ఆన్​లైన్​ లో నిర్వహణ 
  • వర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు

ఓయూ, వెలుగు : చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు ఓయూ అధికారులు జీ హుజూర్ అన్నారు. ఆఫ్​లైన్​లో నిర్వహించాల్సిన పీహెచ్​డీ ఫైనల్ వైవాను ఆన్​లైన్​లో నిర్వహించారు. ప్రత్యేక అనుమతులిచ్చినట్టు చెప్తున్నా దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓయూలో బాల్క సుమన్ ఇంగ్లిష్  సబ్జెక్టులో 2016–-17లో పీహెచ్​డీ అడ్మిషన్ తీసుకున్నారు. నిరుడు నవంబర్ లో థీసిస్​ సబ్మిట్​ చేశాడు. తర్వాత ఫైనల్  వైవాకు తేదీలు ఖరారు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓయూ ఆర్ట్స్  కాలేజీ ఇంగ్లిష్  డిపార్ట్ మెంట్  సెమినార్​ హాల్​లో వైవా ఉంటుందని ప్రకటించారు. 

ఈ విషయాన్ని ఓయూ అధికారులు నోటీస్ బోర్డుపై చెప్పాల్సి ఉన్నా బయటకు చెప్పలేదని సమాచారం. అయితే, ఆఫ్​లైన్​లో నిర్వహించాల్సిన వైవాను ఓయూ అధికారులు ఆన్​లైన్​లో నిర్వహించారు. తాను ఫిజికల్ గా హాజరు కాలేనని, ఆన్​లైన్​కు పర్మిషన్ ఇవ్వాలని సుమన్  విజ్ఞప్తి చేయగా అందుకు అధికారులు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సుమన్  ఆన్​లైన్  వైవా పూర్తిచేయడంతో అధికారులు ఆయనకు పీహెచ్​డీని డిక్లేర్ చేశారు. 

ఆన్ లైన్ లో పర్మిషన్  ఎలా ఇస్తరు?

కరోనా టైమ్ లో మాత్రమే ఫిజికల్ గా హాజరుకాలేని వారికి ఆన్ లైన్​ లో ఇంటర్వ్యూలకు అనుమతులు ఇచ్చారని,  ఇప్పుడు ఎలా ఇస్తారని ఓయూ జేఏసీ లీడర్  సురేశ్​ యాదవ్ అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీతక్క ఫిజికల్​గా వచ్చారని గుర్తు చేశారు. .