ఆపరేషన్​సింధూర్ బ్రీఫింగ్​​: పాక్​ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్​ సోఫియా ఖురేషి

ఆపరేషన్​సింధూర్ బ్రీఫింగ్​​:  పాక్​ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్​ సోఫియా ఖురేషి

భారత.. పాకిస్తాన్​ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.  ఆపరేషన్​ సింధూర్​ గురించి కేంద్రం బ్రీఫింగ్​ ఇచ్చింది.  పాక్​ దాడులను సమర్దవంతంగా తిప్పికొట్టామని కల్నల్​ సోఫియా తెలిపారు.  నిన్న రాత్రి ( మే 9 ) దాదాపు 26 చోట్ల దాడులు చేశారని ఆమె తెలిపారు,  పాకిస్తాన్​ ​ ఆర్మీ విచక్షణా రహితంగా దాడులు చేస్తుందని తెలిపారు.  పంజాబ్​ ఎయిర్​ బేస్​కు దాడికి ప్రయత్నిస్తే పాక్​ దుశ్చర్యను నిర్వీర్యం చేశామని తెలిపారు.  యుద్దం విషయంలో పాక్​ తప్పుడు ప్రకటనలు చేస్తుందని తెలిపారు. పాకిస్తాన్​   ఫైటర్​  జెట్లు భారత భూభాగంలోనికి అనేక సార్లు చొచ్చుకొచ్చాయని వాటిని తిప్పి కొట్టామని  కల్నల్​ ఖురేషి తెలిపారు.