మార్కెట్లోకి ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్

మార్కెట్లోకి  ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్

హైదరాబాద్​, వెలుగు: జాన్సన్ అండ్​ జాన్సన్  బ్రాండ్​ కెన్​వ్యూ.. ప్రజాశక్తి  ఓఆర్ఎస్​ఎల్ తన హైడ్రేషన్  పోర్ట్​ఫోలియోను విస్తరించింది. క్యాలరీల గురించి శ్రద్ధ చూపే వినియోగదారుల కోసం ఓఆర్ఎస్​ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్​ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

ఈ కొత్త డ్రింక్​ శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుందని, జీరో చక్కెర, జీరో క్యాలరీలతో ఎలక్ట్రోలైట్లను అందిస్తుందని తెలిపింది. ఇది ఆరోగ్య స్పృహ కలిగిన వారిని ఆకట్టుకుంటుందని పేర్కొంది. ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టేవారికి ఇది అనువుగా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.