మణిపూర్ ఘటనలపై ఓయూలో ర్యాలీ

మణిపూర్ ఘటనలపై ఓయూలో ర్యాలీ

ఓయూ, వెలుగు: మణిపూర్​లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు, దాడులను నిరసిస్తూ ఓయూ స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలోని ఎన్​సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు  సోమవారం మహా ర్యాలీ తీశారు. మణిపూర్​లోని బాధిత మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసీం, ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు నెలలుగా మణిపూర్​లోని మైతేయ్, కూకి జాతుల మధ్యలో జరుగుతోన్న ఘర్షణలను నియంత్రించడంలో కేంద్ర, ఆ రాష్ట్రంలోని బీజేపీప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్​ చేశారు.   

ముషీరాబాద్: మణిపూర్​లో ఆదివాసులు లేకుండా కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆరోపించారు. మణిపూర్ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మణిపూర్​ శాంతిస్థాపన సంఘీభావ సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాశం యాదగిరితో పాటు మేధావులు, ప్రొఫెసర్లు, హాజరై, విద్యార్థి నాయకులు, మహిళా ఉద్యమకారులు హాజరై మాట్లాడారు.   జాతీయ  మహిళా కమిషనర్  మణిపూర్​కు ఎందుకు వెళ్లలేదని వారు ప్రశ్నించారు.   ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.