
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్రెడ్డి పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి PCC చీఫ్ పదవి తమకు రాకపోతే బీజేపీలోకి వెళ్లడమా ..లేక సొంతపార్టీని ఏర్పాటు చేసుకోవడమా అనేది భవిషత్తు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం గత రెండు సార్లు TPCC చీఫ్ ఎంపిక చేయడంలో విఫలమైందన్నారు. మరోవైపు TRS ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని…కాంగ్రెస్ అధిష్టానం ఈసారి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటుదనే నమ్మకం ఉందని అన్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారన్నారు రాజ్ గోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గొప్పతనం వల్ల గెలువలేదు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల కారణంగానే కేసీఆర్ గెలిచారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్పై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.