ఆర్చరీ వరల్డ్​ కప్​లో  ఇండి​విడ్యువల్ గోల్డ్​ సొంతం

ఆర్చరీ వరల్డ్​ కప్​లో  ఇండి​విడ్యువల్ గోల్డ్​ సొంతం
  • మిక్స్​డ్​లోనూ గెలిచి డబుల్​ ధమాకా

అంటాల్యా: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 11 ఏండ్ల పోరాటం, 20 టోర్నీల తర్వాత ఎట్టకేలకు ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండివిడ్యువల్ కేటగిరీలో గోల్డ్​ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మొదటిదైన వరల్డ్​ కప్  స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. శనివారం జరిగిన కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీల్లో స్వర్ణాలు సాధించింది. ఒజాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డియోటలేతో కలిసి మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగిన జ్యోతి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 159–-154తో 12వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తైపీ జంటను ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వయం 16 బాణాలతో 15 సార్లు 10/10 పాయింట్లు సాధించారు. ఇందులో12సార్లు కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. జ్యోతి ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 సాధిస్తే, ఒజాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకసారి 9 పాయింట్లు గెలవడంతో  కొద్దిలో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు స్కోరు (160/160) మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఇక, ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో తనకు అందని ద్రాక్షగా ఉన్న గోల్డ్​ను సురేఖ ఒడిసిపట్టుకుంది.  ఫైనల్లో తెలుగమ్మాయి149–146తో మాజీ వరల్డ్​ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారా లోపెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కొలంబియా)ను చిత్తు చేసింది. 2021 ఫైనల్లో లోపేజ్​ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. మెన్స్ కాంపౌండ్​లో ధీరజ్, అటాను దాస్​, తరుణ్ ​దీప్​లతో కూడిన  ఇండియా టీమ్​ ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో తలపడనుంది.