
కరాచి: ఇండియన్ ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను పట్టుకున్న పాకిస్తాన్ ఆర్మీ మేజర్ సయ్యద్ ముయిజ్ అబ్బాస్ షా టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని సరర్గోహా ప్రాంతంలో తెహ్రీక్ ఇ తాలిబాన్ టెర్రరిస్టులతో పోరాడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
సయ్యద్ ముయిజ్ ప్రస్తుతం ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్లో మేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం పాక్–అఫ్ఘాన్ బార్డర్లో స్పెషల్ ఆపరేషన్ చేపడుతుండగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో మరో సైనికుడితోపాటు ముయిజ్ చనిపోయారు. ఈ దాడుల్లో 11 మంది తాలిబాన్ టెర్రరిస్టులు కూడా హతమయ్యారు.
2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఎటాక్ తర్వాత మన సైన్యం బాలాకోట్లోని టెర్రరిస్ట్ల స్థావరాలపై ఎయిర్ స్ట్రయిక్స్ జరిపింది. ఆ మరుసటిరోజు పాక్ ఎదురుదాడికి యత్నించగా, అప్పుడు వింగ్ కమాండర్గా ఉన్న అభినందన్ సహా పలువురు పైలట్లు తిప్పికొట్టారు. వాళ్ల విమానాలను కూల్చివేశారు. అదే సమయంలో అభినందన్ మిగ్21 విమానం కూడా పాక్ భూభాగంలో కూలిపోయింది. దీంతో ఆయనను అబ్బాస్షా నేతృత్వంలోని సైనిక బృందం బందీగా తీసుకుంది. అనంతర జరిగిన పరిమాణాలతో అభినందన్ను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించింది.