
కరాచీ: బ్యాటింగ్లో ఇమాముల్ హక్ (90), బాబర్ ఆజమ్ (54) చెలరేగడంతో.. బుధవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలోనూ పాకిస్తాన్ 26 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మిగిలి ఉండగానే హోమ్ టీమ్ 3–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్ 50 ఓవర్లలో 287/6 స్కోరు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (32), ఆగా సల్మాన్ (31) రాణించారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, మిల్నే 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో 261 రన్స్కు ఆలౌటైంది. టామ్ బ్లండెల్ (65), కోల్ మెకన్చీ (64 నాటౌట్), టామ్ లాథమ్ (45), విల్ యంగ్ (33) రాణించినా ప్రయోజనం లేకపోయింది. పాక్ బౌలర్లలో షాహీన్, నసీమ్ షా, మహ్మద్ వసీమ్ తలా రెండు వికెట్లు తీశారు. ఇమామ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.