అమెరికా దాడిని ఖండించిన పాక్

అమెరికా దాడిని ఖండించిన పాక్
  • ఒక్క రోజు ముందే ట్రంప్​ను నోబెల్​కు నామినేట్​ చేస్తూ నిర్ణయం

లాహోర్:ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులను పాకిస్థాన్ ఖండించింది, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్ కు ఉందని పేర్కొంది. అయితే  ఈ దాడులకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2026 నోబెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతి బహుమతికి నామినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. 

భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంక్షోభంలో ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపిన దౌత్యపరమైన జోక్యాన్ని ప్రశంసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. అయితే, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడులతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధోరణి మారింది ఇప్పుడు ఈ దాడులను ‘‘తీవ్రంగా ఆందోళనకరం’’  అని విమర్శించింది. 

ఈ దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయిని, ప్రజల జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్య చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని, అన్ని పక్షాలూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరింది. పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 900 కి.మీ. సరిహద్దు పంచుకుంటుంది కాబట్టి, ప్రాంతీయ శాంతి కోసం సంయమనం అవసరమని వాదిస్తున్నది.

 పాకిస్థాన్ తెహ్రీక్ -ఇ- ఇన్సాఫ్ పార్టీ కూడా ఈ దాడులను ఖండించింది, ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది. సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్, ఒమన్ తదితర ముస్లిం దేశాలు కూడా ఈ దాడులను వ్యతిరేకించాయి. ఇవి ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిణామాలకు దారితీస్తాయని ఖతార్ హెచ్చరించింది.