దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన

దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన
  • పాక్​లో వరద బీభత్సం
  • 937 మంది మృతి
  • నిరాశ్రయులైన 3 కోట్ల మంది
  • దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన

ఇస్లామాబాద్: భారీ వర్షాలు, వరదలకు పాకిస్తాన్​ అతలాకుతలమవుతోంది. వరద బీభత్సానికి 343 మంది చిన్నారులు సహా 937 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ సర్కార్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. జూన్ 14 నుంచి గురువారం వరకు వానల ప్రభావంతో దాదాపు 3 కోట్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారని నేషనల్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్ అథారిటీ(ఎన్‌‌‌‌ఎండీఏ) తెలిపింది. సింధ్ ప్రావిన్స్‌‌‌‌లో నష్టం భారీగా ఉందని.. అక్కడ 306 మంది మృతిచెందారని.. బలూచిస్తాన్‌‌‌‌లో 234, ఖైబర్‌‌‌‌ పంక్తూన్​ఖ్వాలో 185, పంజాబ్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో 165, పీవోకేలో 37, గిల్గిట్–బాల్టిస్తాన్​లో 9 మరణాలు నమోదైనట్లు పేర్కొంది. 

పాక్​లో ఆగస్టు నెల సగటు వర్షపాతం 48 మీ.మీ. కాగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి 166.8 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించింది. అయితే సింధ్​ ప్రావిన్స్​లో 784%, బలూచిస్తాన్​లో 496% అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. పాక్ ​ప్రధాని షెహబాజ్‌‌‌‌ షరీఫ్‌‌‌‌  మంత్రులు, అధికారులతో సమావేశమై ‘వార్ రూమ్’ ఏర్పాటు చేశారని వాతావరణ మార్పుల శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్‌‌‌‌ తెలిపారు.