ఇండియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను బహిష్కరిద్దామా ? పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ బోర్డు ఆలోచన

ఇండియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను బహిష్కరిద్దామా ? పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ బోర్డు ఆలోచన

లాహోర్: టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడంపై పాకిస్తాన్ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. టోర్నీలో పాల్గొనాలా వద్దా? అనే అంశంపై తుది నిర్ణయాన్ని ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం వరకు తీసుకుంటామని పాక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్‌‌‌‌‌‌‌‌సిన్ నఖ్వీ తెలిపాడు. 

భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై ఐసీసీ బషిష్కరణ వేటు వేయడానికి నిరసనగా  పాక్ టోర్నీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఈ క్రమంలో నఖ్వీ తాజాగా దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యాడు.

ఐసీసీ వ్యవహారంపై అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ప్రధాని సూచించినట్లు నఖ్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు సాధ్యమైనంత వరకు మద్దతుగా నిలవాలని ప్రధాని షరీఫ్ బోర్డుకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాక్ ప్రభుత్వం, పీసీబీ రెండు ప్రధాన అంశాలపై ఆలోచిస్తున్నాయి.

అసలు వరల్డ్ కప్ నుండే పూర్తిగా తప్పుకోవాలని లేదంటే  ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఇండియాతో జరిగే  హై -ప్రొఫైల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను బహిష్కరించాలని భావిస్తోంది. మరోవైపు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకుంటే మాత్రం పాక్‌‌‌‌‌‌‌‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోనుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఆ జట్టుపై వేటు వేయడంతో పాటు పీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌లో ఫారిన్ ప్లేయర్లకు అనుమతి ఇవ్వకూడదని  భావిస్తోంది.