కశ్మీర్ బోర్డర్ లో పాకిస్థాన్ కాల్పులు

కశ్మీర్ బోర్డర్ లో పాకిస్థాన్ కాల్పులు

జమ్ముకశ్మీర్ లోని దేశ సరిహద్దులో ఉద్రిక్తత పెరిగింది. పాకిస్థాన్ సైనికులు.. భారత జవాన్లపై కాల్పులు జరిపారు. పూంఛ్ జిల్లాలో  ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు పాకిస్థాన్ బలగాలు.. ఇండయన్ ఆర్మీపై ఫైరింగ్ జరిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత ఆర్మీ ప్రకటించింది. కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతున్నట్టు తెలిపింది.