అసియా కప్ లో భాగంగా రేపు భారత్ తో జరగనున్న మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా పేసర్ షాహిన్ ఆఫ్రిది జట్టుకు దూరం కాగా... ఇప్పుడు వెన్నునొప్పితో మరో పేసర్ మహ్మద్ వసీమ్ అందుబాటులో లేకుండా పోయాడు. ప్రాక్టీస్ టైమ్ లో బౌలింగ్ సెషన్లో పాల్గొన్న వసీమ్కు.. బౌలింగ్ చేస్తున్న సమయంలో వెన్నునొప్పి వచ్చింది.
వెంటనే అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేయగా నొప్పి తీవ్రంగా ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు అతనికి విశ్రాంతినిచ్చి.. అతని స్థానంలో హసన్ ఆలీని జట్టులోకి తీసుకుంది. 21 ఏళ్ల వసీమ్ పాక్ తరపున 11 టీ20 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి జట్టులో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా రేపు రాత్రి 7 గంటలకు భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది.