మహబూబ్ నగర్ జిల్లా 2025–26 వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్

మహబూబ్ నగర్ జిల్లా  2025–26 వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రూ.10,772 కోట్ల అంచనాతో రూపొందించిన 2025–26 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను బుధవారం పాలమూరు కలెక్టర్​ విజయేందిర బోయి రిలీజ్​ చేశారు. కలెక్టరేట్ లో బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకర్లు నిర్దేశంచబడిన లక్ష్యాల మేరకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,390.57 కోట్ల రుణ లక్ష్యానికి గాను, రూ.7,223.68 కోట్ల రుణాలను మంజూరు చేసి 86.10 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు.

 ఈ సంవత్సరం వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.5,906.93 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.2,268.95 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.8,353 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అడిషనల్​ కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, లీడ్  డిస్ట్రిక్ట్  మేనేజర్  కల్వ భాస్కర్, ఆర్బీఐ లీడ్  జిల్లా అధికారి ఎంజడ్.రహమాన్, నాబార్డ్  జిల్లా అభివృద్ది మేనేజర్  పి.షణ్ముఖచారి పాల్గొన్నారు.