
- రేపు పాలమూరు యూనివర్సిటీ నాల్గో కాన్వొకేషన్
- హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ
- పారిశ్రామిక వేత్త ఎంఎస్ఎన్ రెడ్డి గౌరవ డాక్టరేట్కు ఎంపిక
- 83 మందికి గోల్డ్ మెడల్స్అందిచనున్న గవర్నర్
- కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆర్గనైజేషన్ కమిటీ నియామకం
మహబూబ్నగర్/ మహబూబ్నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. గురువారం వర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో పీయూ స్నాతకోత్సవం జరుగనుంది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్జిష్ణుదేశ్ శర్మ చీఫ్ గెస్ట్గా హాజరకానున్నారు. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ ఆర్గనైజింగ్ కమిటీలను నియమించారు.
ఎంఎస్ఎన్ రెడ్డికి గౌవర డాక్టరేట్..
పాలమూరు వర్సిటీలో మూడు సార్లు స్నాతకోత్సవం జరిగింది. నాల్గో సారి జరుగనున్న స్నాతకోత్సవంలో మొదటిసారి ప్రముఖ వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన ఎంఎస్ఎన్ల్యాబోరేటరీస్అధినేత మన్నె సత్యనారాయణరెడ్డి (ఎంఎస్ఎన్ రెడ్డి)కి డాక్టరేట్ఇవ్వనున్నారు. గవర్నర్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ అందుకుంటారు.
12 మందికి పీహెచ్డీ పట్టాలు, 83 మందికి గోల్డ్మెడల్స్..
ఆయా విభాగాల్లో పీహెచ్డీలు పూర్తి చేసిన 12 మందికి పట్టాలు అందించనున్నారు. మైక్రోబయాలజి విభాగంలో చేతన, సంజీవ్ కుమార్, శ్రీనివాసరావు, విజయ్కుమార్, రాజశ్రీనాథ్, కెమిస్ర్టీ విభాగంలో రుకియాభాను, సంధ్య, టి.స్వాతి, డి.వెంకటేశ్, జి.విజయలక్ష్మి, కామర్స్లో రితికా, బిజినెస్ మేనేజ్మెంట్లో సంధ్యారాణి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు.
ప్రతి విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన 83 మందికి గోల్డ్మెడల్స్ అందుకోనున్నారు. వీరితోపాటు పీజీలో 2,809 మంది, ప్రొఫెషనల్ కోర్సుల్లో 8,921 మంది, 18,666 మందికి యూజీ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు.
కమిటీలు ఇలా..
స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్గా వైస్ చాన్సలర్ జీఎన్శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్గా రిజిస్ర్టార్ రమేశ్ బాబు, కోఆర్డినేటర్గా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కె.ప్రవీణ, మరో 11 మందిని కోర్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీతోపాటు మరో ఎనిమిది సబ్ కమిటీలను నియమించారు.
ఒక్కో కమిటీలో ఆరు నుంచి తొమ్మిది మంది ఉంటారు. మెటీరియల్/కంటెంట్ డెవలప్మెంట్కమిటీ, గోల్డ్ మెడల్స్/సర్టిఫికెట్స్ కమిటీ, ఫెసిలిటేషన్ కమిటీ, హాస్పిటాలిటీ/ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, స్టేజ్/ఆడిటోరియం మేనేజ్మెంట్కమిటీ, ఫైనాన్స్కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఇన్ఫ్రాస్ర్టక్చర్ కమిటీలు ఉంటాయి.
మూడు సార్లు స్నాతకోత్సవం ఇలా..
సంవత్సరం పీహెచ్డీలు గోల్డ్ మెడల్స్ యుజీ/పీజీ పట్టాలు
పొందిన వారు పొందిన వారు పొందిన వారు
2014 00 56 7636
2019 00 115 14675
2022 06 71 33577