మల్లన్న స్వామికి ఆదాయం 2, వ్యయం 14

మల్లన్న స్వామికి ఆదాయం 2,  వ్యయం 14

కొమురవెల్లి, వెలుగు: శ్రీ క్రోధి నామ ఉగాది సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత పంచాంగాన్ని వినిపించారు. ఈ ఏడాది శ్రీ మల్లికార్జునస్వామికి ఆదాయం 2 , వ్యయం 14 ఉంటుందని, క్షేత్ర అభివృద్ధి కోసం ఎక్కువ ఖర్చు జరుగుతుందని పండితులు చెప్పారు. 

ఈ ఏడాది అనేక శుభాలు జరుగుతాయన్నారు. క్రోధం కూడా భగవత్​ స్వరూపమేనని, అధర్మం మీద ఈశ్వర క్రోధం ఉంటుందన్నారు. ఈ సంవత్సరం అందరికి స్వామి వారి ఆశీస్సులుండాలని, రాష్ట్రం, దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని స్వామివారిని అర్చకులు ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పర్పటకం లక్ష్మారెడ్డి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు తాళ్లపల్లి రమేశ్​, శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, పాల్గొన్నారు.