
- స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసేందుకు పీ అండ్ జీ రూ.300 కోట్ల ఫండ్
హైదరాబాద్, వెలుగు : తన సప్లయ్ చెయిన్ ఎకోసిస్టమ్ను మెరుగుపరిచేందుకు పీ అండ్ జీ రూ.300 కోట్లను స్టార్టప్లలో ఇన్వెస్ట్ చే యాలని చూస్తోంది. పార్టనర్లు, ఇన్నోవేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని పేర్కొంది. ఇందుకోసం రూ.300 కోట్లతో పీ అండ్ జీ సప్లయ్ చెయిన్ కెటలిస్ట్ ఫండ్ను తీసుకొచ్చింది. ప్రధాని మోదీ తీసుకొచ్చిన గతి శక్తి స్కీమ్కు పోలినట్టే తమ ఇనీషియేటివ్ కూడా ఉందని పీ అండ్ జీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
సప్లయ్ చెయిన్ ఎకోసిస్టమ్లో డిజిటైజేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం, కెపాసిటీ పెంచడం, సస్టయినబిలిటీ, పారదర్శకత వంటి అంశాలను మెరుగుపరచడంపై ఈ ఫండ్ ఫోకస్ పెడుతుంది. ఇన్నోవేటివ్ సొల్యూషన్లను అందించేందుకు ‘వీగ్రో’ పేరుతో పీ అండ్ జీ ఇండియా ఓ కొత్త ఫండ్ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే తన సప్లయ్ చెయిన్ను మెరుగుపరుచుకునేందుకు కొత్త ఫండ్ ప్రకటించింది.