అమీన్పూర్, వెలుగు : ఈనెల 7,8,9 తేదీల్లో మెదక్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ అమీన్పూర్మున్సిపల్పరిధిలోని బీరంగూడ కమాన్ నుంచి శివాలయం గుడికమాన్వరకు శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. అనంతరం పాండురంగారెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు.
మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఉన్న బలంతో కార్మికులను బానిసలుగా చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్కోడ్లను తేచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సీఐటీయూ అని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, జార్జ్, శ్రీనివాస్రెడ్డి, వీరస్వామి, రామకృష్ణ, జిలాని, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.
