పేపర్ ​లీకేజ్ కేసు.. సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు విచారణ

పేపర్ ​లీకేజ్ కేసు.. సీబీఐ దర్యాప్తుపై  హైకోర్టు విచారణ

టీఎస్ పీఎస్​సీ లో సంచలనం సృష్టించిన పేపర్​ లీకేజ్​ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టింది. కాంగ్రెస్​ నేత బక్క జడ్సన్​ లీకేజ్ ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్​వేశారు. 

దీనికి సంబంధించి పిల్ పై ఇవాళ విచారణకు స్వీకరించింది. టీఎస్​పీఎస్​సీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.