
పోర్ట్ మోర్సీబీ: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్కు పపువా న్యూగినియా (పీఎన్జీ) జట్టు అర్హత సాధించింది. ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పీఎన్జీ 100 రన్స్ తేడాతో ఫిలిప్పీన్స్పై గెలిచింది. అమిని పార్క్లో జరిగిన ఈ మ్యాచ్లో పీఎన్జీ 20 ఓవర్లలో 229/6 స్కోరు చేసింది. టోనీ ఉరా (61), కెప్టెన్ అసద్ వాలా (59), చార్లెస్ అమిని (53) రాణించారు. తర్వాత ఫిలిప్పిన్స్ 20 ఓవర్లలో 129/7 స్కోరుకే పరిమితమైంది. డానియెల్ స్మిత్ (34) టాప్ స్కోరర్. హుజాఫియా మహ్మద్ (23), అర్ష్దీప్ సింగ్ శర్మ (22) ఫర్వాలేదనిపించారు.