రిజల్ట్ ఇచ్చి.. పోస్టులు భర్తీ చేయండి

రిజల్ట్ ఇచ్చి.. పోస్టులు భర్తీ చేయండి
  •  పారామెడికల్, ల్యాబ్​టెక్నిషియన్స్​ అభ్యర్థులు 

 జూబ్లీహిల్స్​,వెలుగు: 2017లో  టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్​ద్వారా పరీక్షలు రాసి 325 మంది అర్హత సాధించామని, ఏడేండ్లుగా పోస్టులు భర్తీ చేయడంలేదని అభ్యర్థులు విజయ్​కుమార్, రహీం, శాంతి, మహేశ్వరి తదితరులు వాపోయారు. పారామెడికల్, ల్యాబ్​టెక్నిషియన్స్​అభ్యర్థులు మంగళవారం జూబ్లీహిల్స్​లో సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో వారిని పోలీసులు పెద్దమ్మ ఆలయం వద్ద అడ్డుకున్నారు. సీఎంను కలిసేందుకు కొందరికి అనుమతి ఇచ్చారు. దీంతో వారు  సీఎం పీఏకు వినతిపత్రం అందించి.. డిప్యూటీ సీఎంను కలిసేందుకు గాంధీ భవన్​కు వెళ్లారు.

న్యాయం చేయాలని మాజీ హోంగార్డులు ..

ఉమ్మడి ఏపీలో హోంగార్డులను  పలు కారణాలతో తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ  సీఎం ఇంటిని ముట్టడించేందుకు మాజీ హోంగార్డులు వెళ్తుండగా పెద్దమ్మ ఆలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు హోంగార్డులు మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై ట్రిబ్యునల్​ను ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదేశించిందని పేర్కొన్నారు. 

అయితే.. ఫిజికల్​టెస్ట్​ ఫిట్​నెస్​ టెస్ట్​లో కాకపోవడంతో అనర్హులుగా ప్రకటించారని వాపోయారు.  తాము 40 ఏళ్లు పైబడి ఉన్నామని మానవతా దృష్టిలో తిరిగి విధుల్లో తీసుకోవాలని వరంగల్​కు చెందిన చంద్రశేఖర్, జి.రవి, డి.సురేష్​, బేబి రాణి తదితరులు సీఎంను కోరారు. కొందరిని మాత్రమే సీఎంను కలిసేందుకు అనుమతించారు.