టీచర్ల కోసం ఆందోళన

టీచర్ల  కోసం ఆందోళన

తూప్రాన్ , వెలుగు: కిష్టాపూర్​ స్కూళ్లో  కేవలం ముగ్గురే టీచర్లు ఉండడంతో తమ  పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేశారు.  తూప్రాన్ మండలం  కిష్టాపూర్ యూపీఎస్ స్కూల్​ లో 1నుంచి7 తరగతులు ఉన్నాయి.  103  మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో అన్ని లెస్సన్స్​ చెప్పలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి టీచర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.