Paris Olympics 2024: ఐర్లాండ్‌ను చిత్తుచేసిన భారత్.. గ్రూప్-బిలో అగ్రస్థానం

Paris Olympics 2024: ఐర్లాండ్‌ను చిత్తుచేసిన భారత్.. గ్రూప్-బిలో అగ్రస్థానం

–పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ అదరగొడుతోంది. న్యూజిలాండ్‌పై విజయంతో టోర్నీని ప్రారంభించిన భారత్.. మంగళవారం(జులై 30) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బురిడీ కొట్టిస్తూ 2 గోల్స్ సాధించారు. తద్వారా 2-0 తేడాతో  విజయం సాధించి గ్రూప్-బి నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. 

also read : Paris Olympics 2024: రైతు బిడ్డకు ఒలింపిక్స్‌లో కాంస్యం.. ఎవరీ సరబ్‌జోత్ సింగ్..?

అంతకుముందు భారత్.. తమ తొలి మ్యాచ్‌‍లో న్యూజిలాండ్‌పై 3-2  విజయం సాధించారు. అనంతరం అర్జెంటీనాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించారు.